Telangana: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారని, కానీ ఐఏఎస్, ఐపీఎస్లుగా అవ్వాలంటే అపారమైన కష్టపడాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.
Read Also: Telangana Cabinet Meeting : ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
పోటీ పరీక్షలకు స్టూడెంట్స్ సిద్ధం అవ్వాలి
గత 10 ఏళ్లలో తెలంగాణ హరితాభివృద్ధికి ఎఫ్సీఆర్ఐ కీలక వేదికగా మారిందని తెలిపారు. అడవులను పరిరక్షించడం, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యూత్ను తయారు చేయడంలో ఎఫ్సీఆర్ఐ సంస్థలో ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ఖాళీ అధ్యాపకుల పోస్టుల భర్తీతోపాటు.. సీనియర్ ఫ్యాకల్టీల నియామకం..
మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రతిపాదనలు పంపాలని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని భర్తీ చేస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. పోటీ పరీక్షలకు స్టూడెంట్స్ సిద్ధం అవ్వాలని పేర్కొన్న మంత్రి సురేఖ.. ఫారెస్ట్రీలో ఉన్న విస్తృత అవకాశాలను ఉపయోగించుకోవాలని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: