हिन्दी | Epaper

Supreme Court on Cough Syrup Deaths: దగ్గు మందు మరణాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Anusha
Supreme Court on Cough Syrup Deaths: దగ్గు మందు మరణాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court on Cough Syrup Deaths: ఉజ్బెకిస్థాన్, గాంబియా దేశాలలో భారతీయ ఫార్మా సంస్థలు తయారు చేసిన దగ్గు మందులు సేవించి చిన్నారులు మరణించిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఔషధాల తయారీకి పాల్పడిన సదరు ఫార్మా సంస్థ, అధికారులపై ధర్మాసనం మండిపడింది. “మీరు కేవలం డబ్బు కోసమే ఈ వ్యాపారం చేస్తున్నారా? మీ స్వార్థం వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది” అని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.

Read Also: Chhattisgarh: బ్లేడ్లు, పిన్నలు సాయంతో చేతులు కోసుకున్న స్కూల్ విద్యార్థులు

Supreme Court outraged over cough syrup deaths
Supreme Court outraged over cough syrup deaths

హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత – అధికారులకు సమన్లు జారీ

ఈ కేసులో ఫార్మా సంస్థ, కొందరు అధికారులపై 2024 జనవరిలో యూపీలోని గౌతమ బుద్ధ నగర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు వీటిని కొట్టివేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మందులలో డై ఇథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనాలు కలవడం వల్ల కిడ్నీలు దెబ్బతిని మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870