Gaddi Balamukundam: జిల్లాలోని అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్గా పని చేస్తోన్న గడ్డి బాలముకుందం ఇంట్లో ఎసిబి అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని డిసిసిబి కాలనీలో గల బాలముకుందం ఇంట్లో ఎసిబి డిఎస్పీ సత్యన్నారాయణ ఆధ్వర్యంలో సిఐ భాస్కర్ ఇతర సిబ్బంది కలిసి సోదాలు చేశారు. బాలముకుందం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. కంచిలి బిసి హాస్టల్లో ఇటీవల ఎసిబి అధికారులు తనిఖీలు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడిన రూ.1,84,070లను గుర్తించారు. ఎబిసి డబ్ల్యుఓతో వసూళ్లకు పాల్పడ్డ వార్డెన్లపై విచారణ చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఎసిబి అధికారులు పంపించారు.
Read also:Texas Shooting Incident: టెక్సాస్ బార్లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!
ACB searches in Srikakulam
బంగారం, వెండి వస్తువులతో పాటు నగదును గుర్తించారు.
ఎసిబి అధికారుల విచారణలో ఎబిసిడబ్ల్యుఓ బాలముకుందం అవినీతికి పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఎబిసిడబ్ల్యుఓపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా శ్రీకాకుళం నగరంలోని డిసిసిబి కాలనీలో నివాసం ఉంటున్న బాలముకుందం ఇంటిలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో బంగారం, వెండి వస్తువులతో పాటు నగదును గుర్తించారు. కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణను కొనసాగిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎసిబి అధికారులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: