భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి.. తనను తాను పోలీసులుగా చెప్పుకొని, ఓ మహిళకు సాయం చేస్తానంటూ నమ్మించి మోసం చేశాడు. ముఖ్యంగా సింగపూర్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే నేరం రుజువు కావడంతో.. సింగపూర్(Singapore) కోర్టు అతడికి కఠిన శిక్ష విధించింది. ముఖ్యంగా 12 ఏళ్ల జైలుశిక్షతో పాటు 12 కొరడా దెబ్బల శిక్షను ఖరారు చేసింది.
Read Also: IDFC Bank Scam: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కుంభకోణం
పోలీసు అధికారిగా నాటకం
2022 జూలై 11న రాత్రి 8 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. ఇండోనేషియాకు చెందిన 35 ఏళ్ల మహిళ తన స్నేహితులతో కలిసి సింగపూర్లోని లిటిల్ ఇండియా మెట్రో స్టేషన్ సమీపంలో వేచి చూస్తోంది. అప్పుడే అక్కడకు భారత సంతతికి చెందిన మలేషియ వ్యక్తి 48 ఏళ్ల షర్వీన్ శెట్టి వెళ్లి.. తనను తాను ఓ పోలీసు అధికారి పరిచయం చేసుకున్నాడు. ఇతడి మాటలు నమ్మిన ఆమె.. తన వద్ద ఏదో తనిఖీ చేయాలని నాటకమాడాడు. అలా ఆమెను తన స్నేహితులకు దూరంగా.. మెట్రో స్టేషన్ ఎగ్జిట్ ఎఫ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై అక్కడే ఉన్న పొదల్లో ఆమెపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షర్వీన్ శెట్టిని అరెస్టు చేసి ఫిబ్రవరి 3వ తేదీన హైకోర్టులో హాజరు పరిచారు. అయితే మొదట్లో తాను నేరం చేయలేదని బుకాయించిన షర్వీన్ శెట్టి తన తప్పును అంగీకరించాడు. ఫలితంగా 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు సింగపూర్ చట్టాల ప్రకారం కఠినమైన 12 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: