📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Elephant: రాంచీలో ఏనుగు విధ్వంసం..భయంతో ప్రజలు పరుగులు

Author Icon By Vanipushpa
Updated: February 28, 2026 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అడవుల్లో ఉండాల్సిన గజరాజు మంద నుంచి దారి తప్పి అనూహ్యంగా నగరంలోకి ప్రవేశించింది. నగరానికి వచ్చిన ఏనుగుకు ఎటు వెళ్లాలో తెలియని గందరగోళంలో నానా బీభత్సం సృష్టించింది. రోడ్లపై వాహనాల ధ్వంసం చేస్తూ అందరిని పరుగులు పెట్టించింది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు విధ్వంసం సృష్టించింది. రోడ్డుపై తిరుగుతూ వాహనాలను తొక్కుకుంటూ పోయింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ అధికారులు.. అక్కడికి చేరుకుని ఏనుగును కంట్రోల్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్నాళ్ల క్రితం కూడా ఇలాగే ఓ ఏనుగు దారి తప్పి రాంచీ(Ranchi) పట్టణంలోకి వచ్చి చేసిన బీభత్సన్ని అందరు తలుచుకుని భయంతో పరుగులు తీశారు. అప్పట్లో ఆ గజరాజు ఏకంగా ఐదు జిల్లాల్లో సంచరిస్తూ 12 రోజుల్లో 16 మందిని పొట్టనబెట్టుకుంది. రాంచీ జిల్లాలోని ఇట్కీ బ్లాక్ లో ఒకే రోజు నలుగురిని హతమార్చింది.

Read Also: New Born Baby: అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

Elephant vandalism in Ranchi

తరుచూ దారి తప్పి జనావాసాల వైపు వస్తున్న ఏనుగులు

జార్ఖండ్ ఏనుగులకు సానుకూల అవాసంగా కొనసాగుతుంది. అయితే గత దశాబ్దా కాలంగా అక్రమ మైనింగ్ పెరిగిపోవడం, అటవీ ప్రాంతాల గ్రామాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, ఏనుగుల స్వేచ్ఛాయుత కదలికకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అంతేకాక బొగ్గు గనుల ప్రాజెక్టులు ఏనుగుల సహజ కారిడార్ ను ప్రతికూలంగా మారాయి. దీంతో అటవీ ప్రాంతాల నుంచి అడవి ఏనుగులు తరుచూ దారి తప్పి జనావాసాల వైపు వస్తున్నాయి. దీంతో మానవ-జంతు సంఘర్షణకు ఏర్పడుతుండగా..అధికారిక గణాంకాల ప్రకారం గడిచిన ఐదేళ్లలో 400మంది వరకు ఏనుగుల దాడిలో మరణించినట్లుగా సమాచారం.

ఏనుగులు ఒక అడవి ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఉపయోగించే ‘ఎలిఫెంట్ కారిడార్లు’ రైల్వే లైన్లు, జాతీయ రహదారులు మరియు గనుల తవ్వకాల వల్ల దెబ్బతిన్నాయి. ఆహారం, నీటి కొరత: అడవుల్లో సహజ వనరులు తగ్గడంతో ఏనుగులు పంట పొలాల వైపు, జనావాసాల వైపు మళ్లుతున్నాయి. మదపు ఏనుగుల ప్రవర్తన: ఇటీవల ఝార్ఖండ్‌లో సుమారు 17 మంది మరణాలకు కారణమైన ఒక ఏనుగు ‘మద స్థితి’ (Musth) లో ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ స్థితిలో ఏనుగులు అత్యంత దూకుడుగా వ్యవహరిస్తాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Elephant Rampage Ranchi Forest Department Alert Human-Wildlife Conflict Jharkhand News Ranchi Elephant Attack Telugu News Paper Telugu News Today Wild Elephant Havoc Wildlife conflict

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.