Postal Jobs: భారత తపాలా శాఖ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,740 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), మరియు గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల మొదటి షార్ట్లిస్ట్ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా, కేవలం పదో తరగతి మార్కుల మెరిట్ ప్రాతిపదికన ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం విశేషం.
Read Also:RRB Exam : రాత పరీక్షల తేదీలు ఇవే.. మరో 2 రోజుల్లోనే అడ్మిట్ కార్డులు విడుదల
ఏపీలో 1,060, తెలంగాణలో 608 ఉద్యోగాలు
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్లో 1,060 పోస్టులు, తెలంగాణలో 608 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వారు పొందిన బాధ్యతను బట్టి నెలకు రూ. 10,000 నుండి రూ. 29,380 వరకు వేతనం లభించనుంది. ఫలితాల జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు తదుపరి దశకు సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.
షార్ట్లిస్ట్లో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోపు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ధృవపత్రాల పరిశీలనకు హాజరుకాని పక్షంలో వారి ఎంపికను రద్దు చేసే అవకాశం ఉంది. కావున, అభ్యర్థులు తమకు కేటాయించిన వెరిఫికేషన్ కేంద్రాలకు అవసరమైన అన్ని పత్రాలతో సకాలంలో చేరుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: