हिन्दी | Epaper

India: రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

Vanipushpa
India: రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

అఫ్గానిస్థాన్‌(Afghanistan)పై పాకిస్థాన్‌ వైమానిక దాడులు జరపడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పౌరులు మరణించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​ ఒక ప్రకటనను విడుదుల చేశారు. ‘పవిత్ర రంజాన్​ నెలలో మహిళలు, పిల్లలు సహా పౌరుల ప్రాణనష్టం దారితీసిన అప్గాన్ భూభాగంపై పాకిస్థాన్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను బయటకు మళ్లించడానికి చేసిన మరో ప్రయత్నం. అఫ్గాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వతంత్రతకు భారత్ మద్దతు ఇస్తూనే ఉంటుంది’ అని రణధీర్​ జైస్వాల్ తెలిపారు.

Read Also: Cash withdrawal using Aadhaar: కార్డు లేకపోయినా నగదు విత్‌డ్రా.. ఆధార్ ఉంటే చాలు!

India: Pakistan attacks Afghanistan during the month of Ramadan..India is angry
India: Pakistan attacks Afghanistan during the month of Ramadan..India is angry

కాబూల్‌లోని పాకిస్థాన్ రాయబారికి సమన్లు జారీ

ఇదిలా ఉండగా, ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ (IEA) విదేశాంగ మంత్రిత్వ శాఖ కాబూల్‌లోని పాకిస్థాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. నంగర్హార్, పక్తికా ప్రావిన్సులపై పాకిస్తాన్ సైన్యం దాడులు జరిపిందని తెలిపింది. ఈ ఘటనల్లో డజన్ల కొద్దీ పౌరులు మృతిచెందారని అప్గాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేసింది.
అఫ్గానిస్థాన్​పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 80 మందికి పైగా మరణించినట్లు ఇస్లామాబాద్​ భద్రతా వర్గాలు తెలిపినట్లు స్థానిక మీడియాలు పేర్కొంది. ఇటీవలి ఆత్మాహుతి దాడులకు అఫ్గానిస్థాన్​లో ఉన్న మిలిటెంట్లను బాధ్యులుగా ఆరోపిస్తూ పాక్​ ఈ దాడులు చేపట్టినట్లు తెలిపాయి. నంగర్హార్, పక్తికా, ఖోస్ట్ ప్రావిన్సులలోని ఏడు ప్రాంతాలపై ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. లక్ష్యంగా తీసుకున్న ప్రదేశాల్లో నంగర్​హార్​లోని న్యూ సెంటర్ నం.1, న్యూ సెంటర్ నం.2, ఖోస్ట్‌లో ఖ్వారిజీ మౌల్వీ అబ్బాస్ సెంటర్, అలాగే పక్తికాలోని కొన్ని మిలిటెంట్ స్థావరాలు ఉన్నట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

హైదరాబాద్‌లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ ముప్పు

హైదరాబాద్‌లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ ముప్పు

భారత్ ఎగుమతుల్లో ఐఫోన్ టాప్.. స్మార్ట్‌ఫోన్లు చరిత్ర సృష్టించాయి

భారత్ ఎగుమతుల్లో ఐఫోన్ టాప్.. స్మార్ట్‌ఫోన్లు చరిత్ర సృష్టించాయి

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట!

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట!

చిన్నారి రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం ముందుకొచ్చిన దాతలు

చిన్నారి రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం ముందుకొచ్చిన దాతలు

భారత్ బ్యాడ్ రికార్డ్

భారత్ బ్యాడ్ రికార్డ్

భారీగా పతనమైన IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు

భారీగా పతనమైన IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు

బెంగళూరుకు బిగ్ షాక్.. మంగళూరుకు వెళ్లిపోతున్న ఐటీ కంపెనీలు

బెంగళూరుకు బిగ్ షాక్.. మంగళూరుకు వెళ్లిపోతున్న ఐటీ కంపెనీలు

కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

అనారోగ్యంతో భర్త.. మనస్థాపంతో భార్య మృతి

అనారోగ్యంతో భర్త.. మనస్థాపంతో భార్య మృతి

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- పలు రాష్ట్రాల్లో హింసాకాండ

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- పలు రాష్ట్రాల్లో హింసాకాండ

ఉగాదికి ఏపీ జాబ్ క్యాలెండర్: లోకేశ్

ఉగాదికి ఏపీ జాబ్ క్యాలెండర్: లోకేశ్

📢 For Advertisement Booking: 98481 12870