పాకిస్థాన్(Pakistan) మరియు అఫ్గానిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదిరి పాకాన పడింది. శుక్రవారం తెల్లవారుజామున పాక్ వైమానిక దళాలు అఫ్గాన్ (Afghan) భూభాగంపై దాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
F-16 యుద్ధ విమానం కూల్చివేత వార్త.. వైరల్ వీడియో
తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్కు చెందిన F-16 ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు అఫ్గాన్ మీడియా ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక విమానం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. నిజనిర్ధారణ (Fact Check): ఈ వీడియోపై జాతీయ మీడియా సంస్థలు పరిశీలన జరపగా, ఇది ఫేక్ వీడియో అని తేలింది. వీడియోలో కనిపిస్తున్న విమాన నమూనాకు, అసలైన F-16 జెట్కు ఏమాత్రం పోలిక లేదని రక్షణ నిపుణులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు అఫ్గాన్ ప్రభుత్వం కానీ, పాక్ ప్రభుత్వం కానీ అధికారికంగా దీనిని ధృవీకరించలేదు.
Read Also: Modi Israel: మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్స్

పాక్ ప్రధాని స్పందన
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ దళాల దుశ్చర్యలకు తమ సైన్యం దీటుగా సమాధానం ఇస్తోందని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.సరిహద్దుల్లో సమస్యలు తలెత్తిన ప్రతిసారీ భారత్ను లాగడం పాకిస్థాన్కు అలవాటుగా మారింది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్ ప్రస్తుతం భారత్లో ఒక కాలనీగా మారిపోయిందని ఆయన విమర్శించారు. తాలిబన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులను ఏకం చేసి, పాకిస్థాన్పై దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. అఫ్గాన్ దళాలకు దీటుగా తమ సైన్యం స్పందిస్తోందని పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ అన్నారు. మరోవైపు సరిహద్దుల్లో దాడులు జరుగుతుండగా పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిప్ భారత్పై మళ్లీ నోరు పారేసుకున్నారు. అఫ్గాన్ భారత్లో ఓ కాలనీగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. తాలిబన్లు ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులందరినీ పోగేసి ఉగ్రదాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: