Nara Lokesh: VSR ఏవియేషన్తో హెరిటేజ్ సంస్థకు ఎలాంటి వ్యాపార లేదా ఆర్థిక లావాదేవీలు లేవని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అంశంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
Read Also:Prasada Rao: డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన
రాజకీయ ఆరోపణలంటూ వైసీపీపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి
2022లో హెరిటేజ్ ఫిన్లాజ్ నుంచి VSR సంస్థ రుణం తీసుకున్న విషయాన్ని ప్రస్తావించిన లోకేశ్, అప్పట్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని లేదా అజిత్ పవార్ VSR హెలికాప్టర్లో ప్రయాణిస్తారని ఎవరైనా ఊహించారా? అంటూ ప్రశ్నించారు. ఈ ఆరోపణలు రాజకీయ లాభం కోసం చేసినవేనని ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీ ఆరోపణలను “బాబాయ్ను హత్య చేసి మా చేతిలో కత్తి పెట్టినట్టే” అని పోల్చిన లోకేశ్, ఇవన్నీ ఆధారరహిత ఆరోపణలేనని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: