Nalgonda road accident: నల్గొండ జిల్లా చందనపల్లి సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మునుగోడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ షేక్ తయ్యూబ్ (30) దుర్మరణం చెందారు. విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో మృత్యువు కబలించడం పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది.
Read Also: Bengaluru Highway Accident: బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం
విధి నిర్వహణ ముగించుకుని వెళ్తుండగా ప్రమాదం
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా కానిస్టేబుల్ తయ్యూబ్ శుక్రవారం రోజంతా తన విధులను సమర్థవంతంగా నిర్వహించారు. విధులు ముగించుకుని తన స్వగ్రామమైన నకిరేకల్కు బైక్పై బయలుదేరారు. చందనపల్లి వద్దకు చేరుకోగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన డీసీఎం (DCM) వాహనం తయ్యూబ్ బైక్ను బలంగా ఢీకొట్టింది.
Nalgonda road accident: అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన తయ్యూబ్
ప్రమాదం జరిగిన తీరు చాలా భీభత్సంగా ఉండటంతో, తయ్యూబ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే నల్లగొండ రూరల్ ఎస్సై తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు.. దర్యాప్తు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. యువ కానిస్టేబుల్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, తోటి సహచర పోలీసులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: