📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PJTSAU Events: మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

Author Icon By Rajitha
Updated: March 3, 2026 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్చి 8,9 తేదీల్లో రాజేంద్రనగర్ లో మెగా మహిళా రైతు మేళాని నిర్వహించనున్నది. రాష్ట్ర వ్యవసాయ శాఖ,కోరమాండల్ ఇంటర్నేషనల్ లు ఈ కార్యక్రమం నిర్వహణకి తోడ్పాటు అందిస్తున్నాయనీ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు.ఈ మెగా మహిళా రైతు మేళా ని విజయవంతం గా నిర్వహించడానికి అవసరం అయిన ఏర్పాట్లు గురించి చర్చించడానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి, ఉద్యాన శాఖ సంచాలకులు యాస్మీన్ బాషా, తదితరులు దీనిలో పాల్గొన్నారని పీజేటీఏయూ ఉప కులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.

Read also: Gandhanguda government : రూ.600 కోట్ల భూమి రక్షణ, గంధంగూడలో హైడ్రా చర్య

PJTSAU Events

తొలిసారిగా మహిళా రైతు మేళా

వ్యవసాయ విశ్వవిద్యాలయం గతంలో ఎన్నో రైతు మేళాలని నిర్వహించినప్పటికీ వ్యవసాయంలో మహిళల కీలక పాత్రని గుర్తించి తొలిసారిగా మహిళా రైతు మేళాని నిర్వహిస్తున్నట్లు జానయ్య వివరించారు. మహిళా రైతుల సాధికారిత లక్ష్యంగా నిర్వహించనున్న ఈ మేళాకి సుమారు 8 నుంచి 10 వేల మంది మహిళా రైతులు హాజరవుతారని జానయ్య పేర్కొన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలోని సెర్ప్ కి చెందిన సుమారు మూడు వేల మంది మహిళా రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని జానయ్య వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వ్యవసాయం అనుబంధ శాఖలన్నీ పూర్తిగా సహకరించాలని సురేంద్ర మోహన్ సూచించారని జానయ్య వివరించారు.

ఈ రెండు రోజుల మెగా మహిళా రైతు మేళాలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్ళు వాటి పరిష్కారాల పై శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయని జానయ్య తెలిపారు. అదే విధంగా అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల వచ్చే దుష్ప్రభావాలు మరియు మార్కెట్ లో గిరాకీ ఉన్న వరి రకాల సాగు వంటి అంశాల పై విశ్వవిద్యాలయం విద్యార్థిని, విద్యార్థులచే ఆటా, పాట కార్యక్రమాలుంటాయని జానయ్య వివరించారు.అలాగే వివిధ ఆధునిక సాంకేతిక అంశాలపై సుమారు 70,80 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జానయ్య తెలిపారు

హాజరుకానున్న ప్రముఖులు

ఈ మెగా మహిళా రైతు మేళాకి ముఖ్య అతిధిలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి శ్రీధర్ బాబు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య, రాజేంద్ర నగర్ శాసన సభ్యులు టి. ప్రకాష్ గౌడ్ లు హాజరు అవుతారని జానయ్య తెలిపారు.

ఆహ్వాన పత్రిక అందజేత

ఈ మేళా ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసింది గా వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పిలుపు ఇచ్చారని జానయ్య పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి సెర్ప్ అధికారి రజిత, పీ జే టీ ఏ యూ పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠి బలరాం, విశ్వవిద్యాలయ మహిళా ప్రొఫెసర్ లు, కోరమాండల్ ప్రతినిధులు హాజరు అయ్యారు. మెగా మహిళా రైతు మేళా తొలి ఆహ్వానపత్రిక ని మహిళా ఐ ఏ ఎస్ అధికారిణి యాస్మిన్ బాషా కి అందచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Agriculture Tech latest news PJTSAU Events Rajendranagar Rural Development. Telugu News Women Farmers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.