📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Malla Reddy-Supreme Court: సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి చుక్కెదురు

Author Icon By Anusha
Updated: February 25, 2026 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Malla Reddy-Supreme Court: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న మల్లారెడ్డి కుటుంబ సభ్యుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Read Also: Sanathnagar Murder Case: కత్తితో పొడిచి చంపిన దుండగులు

వివాదానికి కారణమైన జీడిమెట్ల భూమి

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నం. 82/1/ఈఈలో గల 0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని, ఈ విషయంలో తహసీల్దార్ జారీ చేసిన లేఖను కూడా ఆయన తన పిటిషన్‌లో సవాల్ చేశారు.దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి, 45 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

Malla Reddy faces a challenge in the Supreme Court

ఈ తీర్పును మల్లారెడ్డి తదితరులు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నిన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్‌.వి. అంజరియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.