Madanapalle Girl Case: మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియాకు కీలక వివరాలు అందించారు. నిందితుడి మరణానికి సంబంధించిన పరిస్థితులను ఆయన వివరించారు.
Read Also: Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్
పోలీసుల వాహనం నుండి తప్పించుకున్న నిందితుడు
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కులవర్ధన్, రక్షక్ వాహనం నుండి తప్పించుకుని పారిపోయాడు. నిందితుడు పారిపోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతని ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
చెరువులో శవమై..
గాలింపులో భాగంగా పోలీసులకు నిందితుడు చెరువులో మృతి చెంది కనిపించాడు. నిందితుడు కులవర్ధన్ చెరువులో ఆత్మహత్య(suicide) చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: