LocalBody elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ నెలలోపు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు వంటి అన్ని లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Read Also:Tirupati: పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలి.. జిల్లా కలెక్టర్
ఈ ఎన్నికల నేపథ్యంలో బీసీ వర్గాలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం కల్పించేలా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ పదవుల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ పాలనలో బీసీ వర్గాల రాజకీయ భాగస్వామ్యం మరింత బలపడనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అంశం కీలక రాజకీయ అంశంగా మారే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: