8మంది అరెస్ట్ : డిఎస్పీ పార్థసారథి – ఒడిశా నుంచి కేరళకు తరలింపు – నిందితులు పశ్చిమ బెంగాల్ వాసులు!
కుప్పం : ఒడిషా రాష్ట్రం నుంచి కేరళకు అక్రమంగా తరలిస్తున్న నలభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎనిమంది అంతరాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసినట్లు కుప్పం డిఎస్పీ పార్థసారథి తెలిపారు. సోమవారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శంకరయ్యతో కలసి వివరాలను ఆయన వెల్లడించారు. ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో ఆపరేషన్ వజ్ర పహార్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్లైఓవర్ వంతెన వద్ద సోమవారం కుప్పం అర్బన్ సిఐ శంకరయ్య, ఎస్సై బాబు సిబ్బందితో కలసి విస్తృత తనిఖీలను చేపట్టారన్నారు. ఈ సమయంలో ఎనిమంది యువకులు అనుమానాస్పద రీతిలో ఉండగా వారిని అదుపులో తీసుకుని వారి వద్ద ఉన్న నలభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Read also: Indiramma Indla scam: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇల్లీగల్ వసూళ్లు.. కాంగ్రెస్ నేతపై కేసు!
40 kg of marijuana seized
పట్టుబడిన నిందితులు పశ్చిమబంగా (పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముర్షియాబాద్ జిల్లాకు చెందిన హాసిబుల్ (23), నామిజుల్ (20), సౌమిక్ మండల్ (23), సుమన్ దాస్ (20), హానినూర్ సమాన్ (31), ముత్తకిమ్ మాలిత (23), కిరణ్ మండల్ (27), మోజమ్ మండల్ (54)లు ఉన్నారన్నారు. ఒడిషా నుంచి కేరళకు తరలిస్తూ నిందితులు గంజాయిని ఒడిషా రాష్ట్రం కటక్ ప్రాంతం నుంచి కేరళకు తరలించేవారని డిఎస్పీ తెలిపారు. వీరు హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో బయలుదేరి జోలార్పేట మీదుగా కేరళ వెళ్లేవారన్నారు. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసుల తనిఖీలు విస్తృతంగా ఉండడంతో నిందితులు కుప్పంలో రైలు దిగి కేరళ వెళ్లాలని ప్లాన్ వేశారని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: