IT Sector: ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

Read Time:  1 min
ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!
ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!
FONT SIZE
GET APP

ఇండియన్ ఐటీ రంగం (IT sector)లో గత కొన్ని రోజులుగా ప్రకంపనలు రేగుతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే మన ఐటీ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 4.5 లక్షల కోట్ల రూపాయల మేర తుడిచిపెట్టుకుపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం వల్ల ఐటీ ఉద్యోగాల కోత (Layoffs) పెరగవచ్చని వస్తున్న వార్తలు ఇన్వెస్టర్లను వణికిస్తున్నాయి. నేడు (ఫిబ్రవరి 24) మార్కెట్ ముగిసే సమయానికి ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజాల షేర్లు భారీగా పడిపోయాయి. భారతదేశానికి వెన్నెముకలా నిలిచే ఐటీ రంగం ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ‘సిత్రిణి రీసెర్చ్’ నివేదిక బయటకు వచ్చినప్పటి నుండి ఐటీ షేర్ల విలువ పాతాళానికి పడిపోతోంది. ఈరోజు ఒక్క రోజే నిఫ్టీ ఐటీ సూచీ 2 శాతం మేర క్షీణించింది. ఇన్ఫోసిస్ 3%, టీసీఎస్ 2.3%, విప్రో , ఇతర కంపెనీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. కేవలం 30 రోజుల్లోనే విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల షేర్లు 25 శాతం మేర పడిపోవడం గమనార్హం. మన దేశ జీడీపీలో 10 శాతం వాటా ఇచ్చే ఈ రంగం ఇంతగా దెబ్బతినడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద హెచ్చరిక అని నిపుణులు అంటున్నారు.

AP Cabinet Meeting: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

 IT Sector: A looming threat in the IT sector!
IT Sector: A looming threat in the IT sector!

ఐటీ కంపెనీలకు శాపం?

ఐటీ కంపెనీల పతనానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటివరకు అమెరికా వంటి దేశాలు తక్కువ ఖర్చుతో పనులు అవుతాయని భారతీయ ఐటీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఏఐ కోడింగ్ ఏజెంట్ల వల్ల ఆ ఖర్చు కేవలం కరెంట్ బిల్లు అంత స్థాయికి తగ్గిపోయింది. పలాంటిర్ అనే సంస్థ ప్రకారం, గతంలో ఏళ్ల తరబడి పట్టే ఈఆర్‌పీ మైగ్రేషన్ పనులు ఇప్పుడు ఏఐ సహాయంతో కేవలం రెండు వారాల్లోనే పూర్తవుతున్నాయి. దీనివల్ల క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టులను రద్దు చేసుకుంటున్నారు. 2027 నాటికి టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల ఒప్పందాలు రద్దయ్యే వేగం మరింత పెరుగుతుందని సిత్రిణి నివేదిక హెచ్చరిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.