ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్న రహస్య అణ్వస్త్ర హెడ్ క్వార్టర్స్ను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్(Israel) సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. 2025 సంవత్సరంలో తాము చేసిన దాడుల్లో ధ్వంసమైన ఈ న్యూక్లియర్ ప్లాంటును ఇరాన్ మళ్లీ నిర్మించుకుందని తెలిపింది. టెహ్రాన్ నగర శివార్లలో ఉన్న ఈ అణ్వస్త్ర తయారీ ప్లాంటు పేరు మిన్జా దేహై అని చెప్పింది. ఈవివరాలను మీడియా సమావేశం వేదికగా ఐడీఎఫ్ అధికార ప్రతినిధి ఎఫ్పీ డెఫ్రిన్ తెలిపారు. ఈ న్యూక్లియర్ ప్లాంటులో కొంతభాగం అండర్ గ్రౌండ్లో ఉందన్నారు. ఇందులో అణ్వస్త్రాల తయారీపై ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు రహస్య పరిశోధనలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Read Also: Trump health news : ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు, మెడపై ఎర్రటి మచ్చలు వైరల్
ఫిబ్రవరి 3న మిన్జా దేహై న్యూక్లియర్ కర్మాగారంపై దాడులు
2025 జూన్లో ఆపరేషన్ రైజింగ్ లయన్ సైనిక చర్యను ఇజ్రాయెల్ మొదలుపెట్టాక, ఈ ప్లాంటులో రహస్యంగా అణ్వస్త్ర తయారీ పరిశోధనలను ప్రారంభించారని ఎఫ్పీ డెఫ్రిన్ వివరించారు. గతేడాది 12 రోజుల పాటు ఇరాన్(Iran)లోని మిగతా న్యూక్లియర్ సైట్లపై తాము దాడులు చేస్తుండగా, టెహ్రాన్ శివారులోని మిన్జా దేహై న్యూక్లియర్ కర్మాగారంలో నిరాటంకంగా పరిశోధనలు కొనసాగాయన్నారు. మిగతా న్యూక్లియర్ సైట్లలోని అణ్వస్త్ర ప్రయోగ పరికరాలు, టెక్నాలజీ, ఇతర వసతులను మిన్జా దేహై న్యూక్లియర్ కర్మాగారంలోకి ఇరాన్ తరలించిందని ఆయన తెలిపారు. అప్పట్లో ఇరాన్ అణుశాస్త్రవేత్తల అనుమానాస్పద కదలికలను, వారంతా కొత్త లొకేషన్కు వెళ్లడాన్ని తాము ఎప్పటికప్పుడు ట్రాక్ చేశామన్నారు. ఆ సమాచారం ప్రకారమే ఇప్పుడు ఫిబ్రవరి 3న మిన్జా దేహై న్యూక్లియర్ కర్మాగారంపై దాడులు చేశామని ఎఫ్పీ డెఫ్రిన్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: