సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(Khameni) నేతృత్వంలోని ఇరాన్ నాయకత్వం తనతో చర్చల జరిపేందుకు ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతోన్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై చర్చల కోసం ఇరాన్ నాయకులు తనకు ఫోన్ చేశారని తెలిపారు. అమెరికా చేతిలో దెబ్బలు తినడం వారికి విసుగు చెంది ఉంటుందని అందుకే చర్చలకు వచ్చినట్లు తెలుస్తోందన్నారు. త్వరలోనే ఇరాన్ నాయకత్వంతో భేటీ అయ్యే అవకాశం ఉందని అది కూడా ఒక సమావేశం మాత్రమే జరుగుతుందన్నారు. అయితే, ఇరాన్ తన పరిమితులు దాటినట్లుగా కనిపిస్తోందని భేటీకి ముందే తాము చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇరాన్ నాయకులు కేవలం హింస ద్వారానే పరిపాలిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని చెప్పిన ట్రంప్, ఇరాన్పై బలమైన ప్రత్యామ్నాయాలను కోసం పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
Read Also: Miguel Diaz-Canel: దేశం కోసం పోరాడతాం అంటూ ట్రంప్కు క్యూబా ఘాటు హెచ్చరికలు
మేం గ్రీన్లాండ్ను తీసుకోకపోతే రష్యా, చైనా తీసుకుంటాయి: ట్రంప్
మరోవైపు గ్రీన్లాండ్ వ్యవహారంపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరోసారి మాట్లాడారు. ఆ ద్వీపాన్ని అమెరికా తీసుకోకపోతే, రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని అభిప్రాయపడ్డారు. గ్రీన్లాండ్ను ఆ దేశాల వశం చేసుకోకుండా తాను అడ్డుకుంటానని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్తో ఒప్పందానికి తాను ఇష్టపూర్వకంగా ఉన్నానని, అది సులభమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ గ్రీన్లాండ్ తమది కాబోతుందని తెలిపారు. “మేం గ్రీన్లాండ్ను తీసుకోకపోతే రష్యా, చైనా తీసుకుంటాయి. అది నేను జరగనివ్వను. నేను నాటోను కాపాడిన వ్యక్తిని వారిని జీడీపీలో 5.5% చెల్లించేలా వారిని నేను ఒప్పించాను. అది 2 శాతంగా ఉన్నప్పుడు వారు చెల్లించలేదు, ఇప్పుడు వారు 5 శాతం చెల్లిస్తున్నారు. నేను నాటోను రక్షించాను అని ట్రంప్ అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: