దేశం చుట్టూ అమెరికా సైనిక మోహరింపులను పెంచుతుండటంతో భూగర్భంలోని తమ అణు కేంద్రాల భద్రతను బలోపేతం చేసుకోవడంపై ఇరాన్(Iran) ఫోకస్ పెట్టింది. శక్తివంతమైన బాంబు దాడులనూ తట్టుకొని నిలువగలిగేలా వాటిలో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ అంశాలను నిరూపించే తాజా శాటిలైట్ ఫొటోలతో అమెరికాకు చెందిన అణ్వస్త్ర కార్యక్రమాల అధ్యయన సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఓ నివేదికను విడుదల చేసింది. భూగర్భంలో అణు కేంద్రాలు ఉన్న కీలకమైన ప్రదేశాలు పైకి ఏమాత్రం కనిపించకుండా ఇరాన్ ప్రస్తుతం నిర్మాణ పనులను చేయిస్తోందని ఈ నివేదిక పేర్కొంది. ఓ వైపు అమెరికాతో చర్చలు జరుపుతూనే, మరోవైపు అణుకేంద్రాల ఆనవాళ్లను దాచేందుకు ఇరాన్ యత్నిస్తుండటం ఆందోళనకర అంశమని ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ తెలిపింది. పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న తాలేఘాన్-2 అణు కేంద్రం పైకి కనిపించకుండా, దాన్ని మట్టితో పూడ్చేసే పనిలో గత రెండు, మూడు వారాలుగా ఇరాన్ బిజీగా ఉందని చెప్పింది.
Read Also: China: బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

శాటిలైట్ల కంటికి ఈ అణుకేంద్రం చిక్కకుండా జాగ్రత్త
ఇరాన్లోని పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్ పరిధిలోనే తాలేఘాన్ 2 అణు కేంద్రం ఉంది. ఇది ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఆగ్నేయ దిశలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫిబ్రవరి 13న అమెరికా తీసిన శాటిలైట్ ఫొటోల ప్రకారం తాలేఘాన్ 2 అణు కేంద్రం ప్రధాన నిర్మాణం చుట్టూ, పైన బలమైన కాంక్రీట్ కవచాన్ని నిర్మించారు. ఈ కాంక్రీట్ కవచంపైన పలుచోట్ల మట్టిని పేర్చారు. తద్వారా అమెరికా యుద్ధ విమానాలు, శాటిలైట్ల కంటికి ఈ అణుకేంద్రం చిక్కకుండా జాగ్రత్త చర్యలను ఇరాన్ చేపట్టిందని ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పేర్కొంది. త్వరలో తాలేఘాన్ 2 అణు కేంద్రం నిర్దిష్ట ఆనవాళ్లు కనిపించడం కూడా కష్టతరంగా మారొచ్చని తెలిపింది.
త్వరలోనే ఆ మట్టిరాశులతో తాలేఘాన్
అమెరికా యుద్ధ విమానాల దాడుల బారి నుంచి అణుకేంద్రాలను కాపాడుకునేందుకే ఇరాన్ ఈ పనులన్నీ చేస్తోందని ఐఎస్ఐఎస్ ప్రెసిడెంట్ డేవిడ్ ఆల్ బ్రైట్ విశ్లేషించారు. తాలేఘాన్ 2 అణు కేంద్రం చుట్టూ, పైన నిర్మించిన కాంక్రీట్ కవచం కాస్త గట్టిపడగానే, దాన్ని మట్టిరాశులతో కప్పేసే పనిని ఇరాన్ చేస్తుందని ఆయన అన్నారు. ఈ అణుకేంద్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాల కాంక్రీట్ కవచంపైన మట్టిరాశులను పేర్చే అవకాశం ఉందని చెప్పారు. ఇందుకోసం పర్చిన్ ప్రాంతం సమీపంలోని పర్వతాల నుంచి పెద్దఎత్తున మట్టిరాశులను సేకరించే పనినీ ఇరాన్ మొదలుపెట్టిందని డేవిడ్ ఆల్ బ్రైట్ పేర్కొన్నారు. త్వరలోనే ఆ మట్టిరాశులతో తాలేఘాన్ 2 అణుకేంద్రాన్ని పూర్తిగా కవర్ చేసే ఛాన్స్ ఉందన్నారు. కేవలం ఎంట్రెన్స్, ఎగ్జిట్ గేట్ల ఏరియాలను మాత్రమే వదిలే అవకాశం ఉందని తెలిపారు. తాలేఘాన్ 2 అణు కేంద్రం చుట్టూ కాంక్రీట్ కవచాన్ని నిర్మించేందుకు పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్లోనే ప్రత్యేక కాంక్రీట్ బ్యాచ్ ప్లాంటును ఇరాన్ సర్కారు ఏర్పాటు చేసిందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: