📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Iran: ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన

Author Icon By Vanipushpa
Updated: January 16, 2026 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్ (Iran)మరియు ఇజ్రాయెల్ (Israel) దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు యుద్ధ మేఘాలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వరుస హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ఇరాన్‌లో అంతర్గత అల్లర్లు, ఇజ్రాయెల్‌పై దాడుల భయం మధ్య భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఇజ్రాయెల్‌లో ఉన్న సుమారు 18,000 మంది భారతీయ పౌరులను అప్రమత్తం చేసింది. “ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఇజ్రాయెల్‌కు అత్యవసరం కాని ప్రయాణాలను పూర్తిగా నిలిపివేయండి. ఇప్పటికే ఇక్కడ ఉన్నవారు స్థానిక అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ ఇచ్చే భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి” అని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

Read Also: US Iran strike threat : ఇరాన్‌పై అమెరికా దాడి ఖాయమా? ట్రంప్ గతం ఏం చెబుతోంది?

ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన

విమానాల ద్వారా వెంటనే ఆ దేశాన్ని విడిచి పెట్టాలి

ఇరాన్‌లో పెరుగుతున్న నిరసనలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా.. అక్కడ ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న విమానాల ద్వారా వెంటనే ఆ దేశాన్ని విడిచి పెట్టాలని కేంద్రం ఆదేశించింది. ఇరాన్‌లో ఇంటర్నెట్ అంతరాయం ఉన్నందున.. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ నమోదు చేసుకోవాలని కోరింది. అల్లర్లు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, పాస్‌పోర్ట్ వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.

హెల్ప్‌లైన్ నంబర్లు

ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న భారతీయుల కోసం ప్రభుత్వం 24/7 హెల్ప్‌లైన్లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఇజ్రాయెల్‌లోని (టెల్ అవీవ్) వాళ్లు +972-54-7520711, +972-54-3278392 నంబర్లకు లేదంటే cons1.telaviv@mea.gov.in మెయిల్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఈ సంక్షోభంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్.. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘచీతో ఫోన్‌లో చర్చించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

government advisory Iran India Iran Relations Indian citizens in Iran Indian embassy Iran Indian nationals safety Middle East security alert Telugu News online Telugu News Today travel advisory Iran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.