📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Ajit Doval: భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

Author Icon By Vanipushpa
Updated: February 5, 2026 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాణిజ్య ఒప్పందం చర్చలకు సంబంధించి సెప్టెంబర్‌లో జరిగిన ఓ కీలక సమావేశంలో అమెరికాకు భారత్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ట్రేడ్‌ డీల్‌ కోసం తొందరేమి లేదని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్‌ తేల్చిచెప్పినట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనంలో పేర్కొంది. భారత్‌- అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాణిజ్య చర్చల సమయంలో భారత ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై ట్రంప్‌, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో సహా పలువురు అధికారులు నోరు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ (Ajit Doval), అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు సమావేశమయ్యారు. ఆ భేటీలో భారత్​ తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ట్రంప్‌, ఆయన అధికారుల బెదిరింపులకు భారత్‌ తలొగ్గదని, అవసరమైతే వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్‌ పదవీ కాలం ముగిసేవరకు వేచిచూస్తామని రూబియోతో ఢోబాల్‌ చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

Read Also: Epstein email scandal : ఎప్‌స్టీన్ ఫైల్స్ షాక్, మైనర్ల వద్దకు రమ్మంటూ ఈమెయిల్!

Ajit Doval: భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు

అయితే, ఈ సమావేశం జరిగిన కొన్ని రోజులకే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు కొంతమేర తగ్గినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రధాని మోదీకి ట్రంప్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ సమయంలో ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు, ఈ భేటీ గురించి అమెరికా విదేశాంగ ప్రతినిధి కూడా మాట్లాడారు. ప్రైవేటు చర్చల వివరాలు బయటకు వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, భారత్‌ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల భారత్‌- అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో అమెరికా దిగుమతి చేసుకునే భారత వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీంతో దక్షిణాసియాలోని పొరుగు దేశాలు, కీలక ఎగుమతి పోటీదారుల కంటే భారత్​ పైచేయి సాధించినట్లయింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Diplomatic Tensions Geopolitical News India sovereignty India US relations India warning to America Indian foreign policy International Relations Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.