భారతదేశం-బ్రెజిల్ సంబంధాలలో కొత్త అధ్యాయం మొదలైంది. భారత్ (India)– బ్రెజిల్(Brazil) మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కొత్త ఊపునిచ్చే కీలక అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా మధ్య ద్వైపాక్షిక చర్చలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అధ్యక్షుడు లూలా, ఆయన ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి స్వాగతిస్తూ, ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, “అధ్యక్షులు లూలా, ఆయన బృందాన్ని భారతదేశానికి స్వాగతించడానికి సంతోషిస్తున్నాను. భారత్-బ్రెజిల్ సంబంధాలు చాలా కాలంగా ఆయన దార్శనికత, స్ఫూర్తిదాయక నాయకత్వం ద్వారా ప్రయోజనం పొందాయి” అని అన్నారు.
Read Also: AI Summit: తిరుపతి లో బిజేవైఎం నిరసన
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
గత కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు నాయకులు అనేకసార్లు సమావేశమయ్యారు. ప్రతిసారీ బ్రెజిల్ అధ్యక్షులు లూలాకు భారతదేశం పట్ల ఉన్న లోతైన స్నేహం, నమ్మకం స్పష్టంగా అనుభూతి చెందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అధ్యక్షులు లూలా పర్యటన చారిత్రాత్మక AI ఇంపాక్ట్ సమ్మిట్కు శక్తినిచ్చింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. లాటిన్ అమెరికాలో భారతదేశానికి బ్రెజిల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు మించి తీసుకెళ్లడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: