హైదరాబాద్ నగరంలో వాహనాలు నడిపే వారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎవరైనా లైసెన్స్ లేకుండా పట్టుబడితే అక్కడికక్కడే వాహనాన్ని సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు విధిగా తమ వెంట ఒరిజినల్ లైసెన్స్ లేదా డిజిటల్ కాపీని ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
Read also: Indiramma Houses: హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల అమలుకు చర్యలు
Hyderabad Traffic Police
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు మరియు కౌన్సెలింగ్
తనిఖీల్లో పట్టుబడిన వారికి కేవలం జరిమానా విధించడమే కాకుండా వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ హెచ్చరించారు. పట్టుబడిన వాహనదారులు కోర్టుకు వెళ్లి ఫైన్ చెల్లించిన తర్వాతే తమ వాహనాలను విడిపించుకోవాల్సి ఉంటుంది. ఎల్.ఎల్.ఆర్ఉ న్నవారు నిబంధనల ప్రకారం వాహనంపై ‘L’ బోర్డు కలిగి ఉండాలని పోలీసులు గుర్తు చేస్తున్నారు.
కొత్త వాహనాలపై రోడ్డు సేఫ్టీ సెస్ భారం
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వాహనాలు కొనేవారిపై అదనపు భారాన్ని మోపింది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ‘రోడ్డు సేఫ్టీ సెస్’ పేరుతో కొత్త పన్నును అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ద్విచక్ర వాహనాలపై రూ. 2 వేలు, కార్లపై రూ. 5 వేల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిధులను రహదారి భద్రత మెరుగుపరచడానికి మరియు అత్యవసర వైద్య సేవలకు ఉపయోగిస్తారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును ఒకేసారి చెల్లించడం తప్పనిసరి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: