NCRB Report: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం, దేశంలోని ప్రధాన నగరాల్లో ఆహార కల్తీ ఎక్కువగా జరుగుతున్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇటీవల టాస్క్ ఫోర్స్ బృందాలు నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు మరియు సూపర్ మార్కెట్లలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా చోట్ల గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన కూరగాయలు మరియు నిల్వ ఉంచిన మాంసాన్ని వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Read also: Amberpet Crime: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య!
Our lucky city is number one in food adulteration
రుచి ఉంది కానీ శుభ్రత ఎక్కడ?
ప్రజల నాలుకకు నచ్చే రుచిపై చూపిస్తున్న శ్రద్ధను, హోటల్ నిర్వాహకులు శుభ్రతపై చూపడం లేదని టాస్క్ ఫోర్స్ బృందాలు స్పష్టం చేశాయి. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే, తమిళనాడు 20 శాతం సగటుతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ 14 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కేవలం లాభాల కోసమే ఇలాంటి కల్తీకి పాల్పడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.
కఠిన నిబంధనలే ఏకైక మార్గం
ఆహార భద్రత (food safety) విషయంలో అధికారులు ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. హోటళ్లకు లైసెన్సులు జారీ చేసే సమయంలోనే కఠినమైన నిబంధనలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా బయట ఆహారం తీసుకునేటప్పుడు నాణ్యతను గమనించాలని, కల్తీ జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. ప్రజారోగ్యమే పరమావధిగా కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: