Hyderabad: హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజులరామారం మెట్ఖాన్గూడ ప్రాంతంలో ఉదయం 10:10 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భారీ శబ్దంతో పాటు ప్రకంపనలు రావడంతో అపార్టుమెంట్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. చాలా మందికి భూకంపమే జరిగిందన్న అనుమానం కలిగింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
Read also: GHMC: బతుకమ్మ కుంటకు ఆ కాంగ్రెస్ నేత పేరు ?
Earthquake tremors in Qutubullapur circle
భూకంపమా? పేలుడా? ఇంకా స్పష్టత లేదు
ఈ ఘటన భూప్రకంపనల వల్ల జరిగిందా లేక సమీపంలో జరిగిన పేలుడి కారణంగా కంపించిందా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న సీసీ కెమెరాల్లో భూమి కంపించినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్థానికులు మాట్లాడుతూ, ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి ఇళ్లంతా ఊగినట్లు అనిపించిందన్నారు. భయం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారిక నిర్ధారణ కోసం పరిశీలనలు కొనసాగుతున్నాయి.
అధికారుల తనిఖీలు, స్కూల్కు సెలవు
సంఘటన సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖలు ఘటన స్థలానికి చేరుకున్నారు. భద్రతా చర్యల భాగంగా స్థానికంగా ఉన్న ఒక పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సెలవు ప్రకటించింది. ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భూకంపాలపై మరింత సమాచారం తెలుసుకోవడానికి నిపుణుల నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: