China: మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

Read Time:  1 min
మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?
మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?
FONT SIZE
GET APP

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ద్వారా వింత వింత వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని భారీ లాభాలను తెచ్చిపెడితే, మరికొన్ని వివాదాలకు దారితీస్తున్నాయి. చైనా(China)కు చెందిన ఒక మాజీ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ జౌ యువాన్ (Zhou Yuan) కథ కూడా ఇప్పుడు ఇలాగే ప్రపంచవ్యాప్తంగా వైరల్ (Viral) అవుతోంది. ఈమె మగవారిని ఎలా ఆకర్షించాలి? మగవారి దగ్గర ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రదర్శించాలి? అనే అంశాలపై కోర్సులు అందిస్తూ ఆమె ఏకంగా రూ. 31 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకింగ్ వదిలి ట్రైనింగ్ బిజినెస్ వైపు.. 40 ఏళ్ల జౌ యువాన్ ఒకప్పుడు బ్యాంకింగ్ రంగంలో పనిచేసేది. ఆ తర్వాత ఆమె తన వృత్తిని వదిలి.. ‘పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ , ‘రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్’ వంటి అంశాలపై మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ముఖ్యంగా పురుషులను ఎలా ఆకర్షించాలి? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? అనే దానిపై ఆమె రూపొందించిన కోర్సులు చైనాలో విపరీతమైన ఆదరణ పొందాయి.

Read Also: Trade Deal Impact: సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

China: మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?
China: మగవారిని ఎలా ఆకర్షించాలి? ఈ కోర్సుతో రూ. 30 కోట్ల ఆదాయం.. చివరకు ఏమైందంటే?

ఆమె ప్రోగ్రామ్స్‌ లో వేల మంది మహిళలు

నివేదికల ప్రకారం.. ఆమె ప్రోగ్రామ్స్‌ లో వేల మంది మహిళలు చేరారు. నోరు మెదపకుండానే రూ. 8,000 కోట్లు! ఖాబీ లేమ్ సంచలన డీల్.. అసలు విషయం ఇదీ! భారీ ఫీజులు – విస్తుపోయే ఆదాయం ఆమె బిజినెస్ మోడల్ చాలా ఖరీదైనది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చిన్న చిన్న ఆన్‌లైన్ క్లాసుల నుంచి సంపన్న మహిళల కోసం ప్రత్యేకమైన ‘ప్రీమియం’ కోర్సుల వరకు ఆమె నిర్వహించేవారు. అత్యంత ఖరీదైన కోర్సుల ధర ఏకంగా 88,000 యువాన్లు (సుమారు రూ. 10 లక్షలకు పైగా) ఉండేదని సమాచారం. మొత్తం ఆదాయం: వివిధ మీడియా సంస్థల అంచనాల ప్రకారం.. ఆమె ఈ శిక్షణా తరగతుల ద్వారా సుమారు 24 నుంచి 27 మిలియన్ యువాన్ల (సుమారు రూ. 31 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు.

ఆర్థిక లావాదేవీలపై నిఘా

అధికారుల విచారణ ఎందుకు? అయితే ఈ వ్యాపారం ఇప్పుడు అధికారుల దృష్టిలో పడింది. సమాజంలో నైతిక విలువలను దెబ్బతీసేలా ఆమె బోధనలు ఉన్నాయని, మహిళలను కేవలం ఒక వస్తువులా చూపేలా ఆమె పద్ధతులు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో చైనా రెగ్యులేటరీ సంస్థలు జౌ యువాన్ వ్యాపార కార్యకలాపాలపై విచారణ ప్రారంభించాయి. ఆమె సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడంతో పాటు, ఆమెకు సంబంధించిన 8 కంపెనీల ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారు. మొత్తంగా చూస్తే మెరుగైన కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం నేర్పించడం తప్పు కానప్పటికీ.. దానిని ఆదాయ వనరుగా మార్చుకుని సామాజిక విలువలను పక్కన పెట్టడం ఇప్పుడు ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.