భారత్లో చాలామంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)తో బాధపడుతున్నారు. ఈ మహమ్మారిని నిర్మూలించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే శనివారం రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి ఈ వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా కోట్లాది మంది బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ లభించనుంది.
Read Also: Viveka MurderCase: వివేకా హత్యకేసు వడివడిగా సిబిఐ దర్యాప్తు
కేంద్ర ఆరోగ్య శాఖ ఈ టీకాలను ఉచితంగా పంపిణీ
14 ఏళ్లు నిండి 15 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ను వేయనున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ టీకాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. సింగిల్ డోస్ కింద గార్డాసిల్–4 వ్యాక్సిన్ను ఎడమ చేతికి వేస్తారు. ఆ తర్వాత ఎడమ చేతి చూపుడు వేలికి మార్కర్ ఇంక్ పెడతారు. ఇందుకోసం యూ–విన్ (U-–WIN) పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో కుదరకపోతే నేరుగా సెంటర్కు వెళ్లి కూడా టీకా వేసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ మూడు నెలల పాటు సాగనుంది. టీకా తీసుకునే బాలికలు తప్పకుండా టిఫిన్ లేదా భోజనం చేసి రావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ గైడ్లైన్స్ విడుదల చేసింది. ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేయించుకోవద్దని సూచించింది. టీకా వేసుకున్న తర్వాత అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉండాల్సి ఉంటుంది. జ్వరం, తలనొప్పి రావడం కామన్ అని ఆ తర్వాత భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది తప్పనిసరి కాదు. నచ్చివాళ్లు వేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: