📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Breaking News: అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య

Author Icon By Vanipushpa
Updated: January 24, 2026 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలోని జార్జియా(Georgia)లో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసులో అనుమానితుడైన విజయ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది.

Read Also: USA: WHOతో సంబంధాలపై అమెరికా కీలక నిర్ణయం

Breaking News: అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య

పిల్లలు సురక్షితం

మృతులను మీము డోగ్రా(43), గౌరవ్‌ కుమార్‌(33), నిధి చందర్‌(37), హరీశ్‌ చందర్‌(38)గా గుర్తించారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని, వారు ఒక గదిలో దాక్కున్నారని తెలిపింది. వాళ్లలో ఒకరు పోలీసులకు కాల్​ చేసి సమాచారం అందించారని చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లే సరికి నలుగు మృతదేహాలు కనిపించాయని చెప్పారు. పిల్లలు మాత్రం సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించాయి.

దర్యాప్తు కొనసాగింపు

ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని కూడా కాన్సులేట్ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని జార్జియా పోలీసులు వెల్లడించారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, కుటుంబ కలహాల నేపథ్యం, అనుమానితుడి ఉద్దేశాలు వంటి అంశాలపై లోతుగా విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Indian Community Abroad Indian diaspora Indian origin people international crime news murder case in America Telugu News online Telugu News Today US law and order USA crime news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.