📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Pakistan: బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

Author Icon By Vanipushpa
Updated: February 2, 2026 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్(Balochistan Province) ప్రస్తుతం రణరంగాన్ని తలపిస్తోంది. గత 40 గంటలుగా అక్కడ పాకిస్థాన్ సైన్యం చేపట్టిన ‘క్లియరెన్స్ ఆపరేషన్'(clearance operation) లో ఇప్పటివరకు 145 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ(pakistan-army) ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ఈ ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం సంభవించడమే కాకుండా, సాధారణ పౌరులు కూడా బలైపోయారు. ఈ దాడుల్లో 17 మంది లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, 31 మంది పౌరులు మరణించారని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫ్రాజ్ బుగ్టి తెలిపారు. శనివారం 92 మంది ఉగ్రవాదులు మరణించగా, శుక్రవారం 41 మంది మరణించారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది.

Read Also: Ambati Rambabu: ఇక అసలు సినిమా అంబటికి చూపిస్తాం – కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్

Pakistan: బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

15 మంది భద్రతా సిబ్బంది మృతి

ఎదురుకాల్పుల సమయంలో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, దురదృష్టవశాత్తూ 18 మంది సాధారణ పౌరులు కూడా ఈ హింసకు బలైపోయారు. ఈ దాడులకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. తాము డజన్ల సంఖ్యలో పాక్ సైనికులను హతమార్చామని రెబల్స్ పేర్కొనడం గమనార్హం. ప్రావిన్సు రాజధాని క్వెట్టాతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో మిలిటెంట్ల ప్రణాళికలను భగ్నం చేసేందుకు సైన్యం కఠిన చర్యలు తీసుకుంటోంది. క్వెట్టాలోని కీలక భవనాలు, ప్రధాన రహదారులను సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఫోన్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. రైలు రాకపోకలపై నిషేధం విధించి, రవాణా వ్యవస్థను స్తంభింపజేశారు. బలూచిస్తాన్‌లో నెలకొన్న అశాంతిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

army killed militants Balochistan alert Balochistan violence counter terrorism operation militant attack Pakistan Army Operation Security Forces Action Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.