సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీని ఇతర నగరాలకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బొలీవిమా(Bolivia) ఎయిర్ఫోన్స్కు చెందిన సీ-130 హెర్క్యలస్ ట్రాన్స్ఫోర్ట్ విమానం శాంటాక్రూట్ నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరింది. ప్రతికూల వాతావరణ కారణంగా ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్వే నుంచి జారి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్న పలు వాహనాలను ఢీకొట్టింది. విమానం రెక్కలు విరిగిపోయాయి. విమానంలో మంటలు కూడా చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల్లో విమాన సిబ్బందితో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు కూడా ఉన్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.
Read Also: New Born Baby: అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

కొలంబియా విమాన ప్రమాదంలో 15 మంది మృతి
ఇటీవల కొలంబియాలో విమానం ప్రమాదం జరిగింది. జనవరి 29న విమానం కుప్పకూలి పైలట్ సహా 15 మంది మృతి చెందారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు, ఇద్దు సిబ్బంది ఉన్నారు. కుకుటా నుంచి ఒకానాకు వెళ్తున్న విమానం ఈశాన్య కొలంబియాలోని నోర్టే డి శాంటాండర్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 15 మంది కూడా మృతి చెందినట్లు అధికారులు నిర్ధరించారు. ఇందులో పార్లమెంట్ మెంబర్ 36ఏళ్ల డయోజెనెస్ క్వింటెరో ఉన్నారు. ఘటనాస్థలిలో విమాన శకలాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కొలంబియా ఏరోస్పేస్ ఫోర్స్, సివిల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు చేపట్టింది. ఫ్లైట్ డేటా, పర్యావరణ పరిస్థితులను పరిశీలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: