📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Silver investment : బంగారం వద్దు ఎందుకు? పెట్టుబడిదారుల చూపు వెండిపై!

Author Icon By Sai Kiran
Updated: January 19, 2026 • 7:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Silver investment : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పెట్టుబడిదారులు ఇప్పుడు వెండి వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల కాలంలో బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో వెండి కూడా ఒక మంచి పెట్టుబడి మార్గంగా మారుతోంది. జ్యువెలరీ షాపుల్లో వెండి ఆభరణాలతో పాటు వెండి బిస్కెట్లు, నాణేలపై వినియోగదారుల ఆసక్తి స్పష్టంగా పెరిగింది.

గత రెండేళ్లలో బంగారంతో పోలిస్తే వెండిపై వచ్చిన రాబడి ఎక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఎలక్ట్రానిక్స్, సోలార్, సెమీకండక్టర్ల రంగాల్లో వెండి వినియోగం పెరగడం ధరల పెరుగుదలకు మరింత ఊతమిచ్చింది.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ప్రముఖ సంస్థ Amrapali Jewellery సీఈవో తరంగ్ అరోరా మాట్లాడుతూ— వినియోగదారుల డిమాండ్ (Silver investment) మేరకు తమ షాపుల్లో వెండి బిస్కెట్లు విక్రయించడం ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో వెండిని పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు పెట్టుబడి దృష్టితో ప్రజలు వెండి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.

అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో వెండి బిస్కెట్లు, నాణేలు కొనుగోలు చేసే వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే సుమారు 50 శాతం పెరిగిందని Gargi by PNGadgil & Sons కో-ఫౌండర్ ఆదిత్య మోదక్ వెల్లడించారు. బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోవడంతో చాలామంది వెండిని ప్రత్యామ్నాయ పెట్టుబడిగా ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు.

Read also: RBI: ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం

దీపావళి సమయంలో వెండి ధరలు పెరిగినప్పటికీ, కార్పొరేట్ సంస్థలు తక్కువ బరువు ఉన్న వెండి నాణేలను గిఫ్టింగ్ కోసం పెద్ద ఎత్తున ఆర్డర్ చేశాయని తెలిపారు. గత మూడు నెలల్లో వెండి బిస్కెట్లు, బులియన్ కొనుగోళ్లు భారీగా పెరిగాయని వెల్లడించారు. బంగారం లాగా స్థిరత్వం వెండికి లేకపోయినా, అధిక రిస్క్‌తో పాటు ఎక్కువ లాభాల అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఈవీ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, సెమీకండక్టర్ పరిశ్రమల నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఔన్సుకు 90 డాలర్లను దాటింది. రూపాయి విలువ బలహీనపడటంతో దేశీయ స్పాట్ మార్కెట్‌లో వెండి ధర తొలిసారిగా కిలోకు రూ.3 లక్షల మార్కును దాటడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Bullion Market India gold price rise impact gold vs silver investment Google News in Telugu Latest News in Telugu Precious Metals Market safe investment options silver biscuits demand silver coins investment Silver Investment silver price surge Silver Rates Today silver returns silver risk and reward Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.