Gold rates india : పసిడి ధరలు మళ్లీ ఎగబాకుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా ఏడో రోజూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు క్రితం రోజు తగ్గిన వెండి ధర ఈరోజు మళ్లీ గణనీయంగా పెరిగింది.
పెళ్లిళ్ల సీజన్ కారణంగా దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటుండటంతో ధరలు రికార్డు స్థాయిల దిశగా కదులుతున్నాయి. గత వారం రోజులుగా దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు నిరంతరం పెరుగుతున్నాయి.
Read Also: Rinku Singh: తండ్రికి క్యాన్సర్.. అయినా జట్టు కోసం చెన్నైకి చేరుకున్న రింకూ
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 50 డాలర్లు పెరిగి 5200 డాలర్లకు పైగా ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ ధర కూడా పెరిగి ఔన్సుకు 90 డాలర్లను దాటింది.
హైదరాబాద్లో ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 పెరిగి తులం రూ.1,48,400కు చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.110 పెరిగి రూ.1,62,890 వద్ద ఉంది.
వెండి ధర కూడా మళ్లీ పెరిగింది. క్రితం రోజు తగ్గిన ధర ఈరోజు రూ.5,000 పెరగడంతో కిలో వెండి ధర రూ.2,95,000కు చేరింది.
ఈ ధరలు ఫిబ్రవరి 26 ఉదయం నమోదైనవి. రోజులో బులియన్ మార్కెట్లో ధరలు మారే అవకాశం ఉంది. ప్రాంతాలవారీగా రేట్లు మారవచ్చు కాబట్టి కొనుగోలు ముందు స్థానిక ధరలు చెక్ చేయడం మంచిది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: