Gold import duty india : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుని సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయి. దేశ రాజధాని Delhi లో 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే రూ.7,400 పెరిగి రూ.1,65,100కు చేరడం ఇన్వెస్టర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా పెరిగి కిలోకు రూ.2,98,300 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ పెరుగుదల వినియోగదారులకు పెద్ద భారంగా మారింది.
అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారాన్ని ‘సేఫ్ హేవన్ ఇన్వెస్ట్మెంట్’గా భావిస్తూ భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రభావం నేరుగా భారత మార్కెట్పైనా పడుతోంది.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం
ఇదిలా ఉండగా దిగుమతిదారులకు కొంత ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై ‘నోషనల్ వాల్యూ’ను తగ్గించింది. బంగారానికి 1,568 డాలర్ల నుంచి 1,518 డాలర్లకు, వెండికి 3,457 నుంచి 2,657 డాలర్లకు తగ్గించింది. అయితే ఈ రాయితీ కేవలం బిస్కెట్లు, కడ్డీలు, నాణేలకు మాత్రమే వర్తిస్తుంది. అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులకు మాత్రం పెద్దగా ఉపశమనం దక్కడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: