Gold silver rates : బంగారం, వెండి ధరలు మళ్లీ భారీ షాక్ ఇచ్చాయి. ఇటీవల ఒక రోజు స్థిరంగా ఉన్న ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్కరోజే రూ.15 వేల వరకు పెరగడం గమనార్హం. దీంతో మరోసారి రూ.3 లక్షల మార్క్ను దాటింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు భారీగా పెరుగుతుండటం దేశీయ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10న Hyderabad మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆభరణాలకే కాకుండా పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాల్లో బంగారం తప్పనిసరి భాగమైంది. అయితే ప్రస్తుతం పసిడి ధరలు సామాన్యులకు అందని స్థాయికి చేరుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, వాణిజ్య యుద్ధాలు, డాలర్ విలువలో మార్పులు, మార్కెట్లలో ఒడిదుడుకులు వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటూ ఇతర పెట్టుబడులను పసిడిలోకి మళ్లిస్తున్నారు. ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Read Also: Ranji Trophy 2026 : 299 వద్ద ఔట్, ట్రిపుల్ సెంచరీ మిస్! రంజీలో అరుదైన ఘటన
అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ స్పాట్ గోల్డ్ ధర ఒక్క ఔన్సుకు సుమారు 68 డాలర్లకు పైగా పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం 5034 డాలర్లకు పైగా ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ ధర కూడా 4.8 శాతం వరకు పెరిగి ప్రస్తుతం ఔన్సుకు 81.5 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1310 పెరిగింది. దీంతో తులం ధర రూ.1,57,910కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1200 పెరిగి తులం ధర రూ.1,44,750గా నమోదైంది. వెండి ధర కూడా భారీగా పెరిగి ఒక్కరోజే కిలోకు రూ.15,000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,00,000 వద్ద ట్రేడవుతోంది.
ఇక్కడ పేర్కొన్న ధరలు ఫిబ్రవరి 10 ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులో ఏ సమయంలోనైనా ధరలు మారే అవకాశం ఉండటంతో కొనుగోలుదారులు స్థానికంగా తాజా రేట్లు తెలుసుకోవడం మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: