Gold rate today : పసిడి ప్రియులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. గత రెండు రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు, రాత్రికి రాత్రే సీన్ రివర్స్ అయ్యాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పులు దేశీయ ధరలపై నేరుగా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో పాటు మహాశివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి వంటి పండగలు రావడంతో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశముంది. ధరలు తగ్గిన సమయంలో పెళ్లిళ్ల కోసం బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది సిద్ధమయ్యారు. కానీ తాజా ధరల పెరుగుదల వారికి ఊహించని షాక్గా మారింది.
Read Also: Phone: నోట్లో పేలిన ఫోన్ బ్యాటరీ!
అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ మారకం విలువ, యుద్ధ భయాలు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఎంచుకోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 98 డాలర్లు పెరిగి 4,966 డాలర్లకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా 0.52 శాతం పెరిగి ఔన్సుకు 77.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: