Gold Rate 25/02/26 : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు మరోసారి షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు తాజాగా మరింత ఎగబాకాయి. దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధర మాత్రం ఒక్కరోజులో భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది.
హైదరాబాద్ మార్కెట్లో ఫిబ్రవరి 25న 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 400 పెరిగి రూ. 1,48,300కు చేరింది. గత వారం రోజుల వ్యవధిలోనే ధర దాదాపు రూ. 8 వేల వరకు పెరిగినట్లు గమనించవచ్చు. వరుసగా జరిగిన పెరుగుదలతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తుండగా పెట్టుబడిదారులు మాత్రం బంగారంపై ఆసక్తి చూపుతున్నారు.
Read Also: Census 2027 India: జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల

ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 430 పెరిగి హైదరాబాద్లో రూ. 1,61,780 వద్ద కొనసాగుతోంది. ఇది కూడా వారం రోజుల వ్యవధిలో గణనీయంగా పెరిగింది. పసిడి ధరలు పెరుగుతున్నప్పటికీ వెండి ధర ఒక్కరోజులోనే రూ. 10,000 వరకు తగ్గి ప్రస్తుతం కిలోకు సుమారు రూ. 2.90 లక్షల వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గి ఔన్సుకు సుమారు 5,180 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 88 డాలర్ల సమీపంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 90.95 వద్ద ఉంది. పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా కొనసాగుతుండటంతో భవిష్యత్తులో ధరల్లో మరింత మార్పులు ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: