Gold rate today : పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఒక్కరోజు మాత్రమే ఊరటనిచ్చాయి. ఇవాళ మళ్లీ గోల్డ్ రేట్లు పెరిగాయి. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్కరాత్రిలోనే గణనీయంగా పెరగడం దేశీయ ధరలపై ప్రభావం చూపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ అగ్రస్థానాల్లో ఉంటుంది. అయితే ఇటీవల ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో దిగుమతులు కొంత తగ్గినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా అధిక ధరలే కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. గత నెల చివర్లో తగ్గిన ధరలు మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి.
దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.1,48,100 వద్ద ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,61,570కి చేరింది. నిన్న తగ్గిన ధరల తర్వాత మళ్లీ పెరుగుదల నమోదు కావడం గమనార్హం.
Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం
వెండి ధర మాత్రం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2.95 లక్షల వద్ద ఉంది. ఫిబ్రవరి మధ్యలో రూ.2.60 లక్షలుగా ఉన్న ధర కేవలం 10 రోజుల్లోనే రూ.35 వేల మేర పెరిగింది. అయితే జనవరి చివర్లో నమోదైన ఆల్టైమ్ హైతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 5,280 డాలర్లకు చేరగా, వెండి ధర 94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ పెరుగుదల ప్రభావంతో దేశీయ మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: