Gold rate 12/02/26 : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. దీంతో పసిడి మళ్లీ రికార్డు గరిష్ఠ స్థాయిల వైపు కదులుతోంది. అయితే వెండి మాత్రం వరుసగా రెండో రోజు స్థిరంగా కొనసాగుతూ కొనుగోలుదారులకు కొంత ఊరట ఇచ్చింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభానికి ముందు బంగారం రేట్లు పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 46 డాలర్లకు పైగా పెరిగి 5054 డాలర్ల స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్ కూడా 2 శాతం పైగా పెరిగి 82.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ అనిశ్చితులు, పెట్టుబడిదారుల సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు కారణంగా పసిడి ధరలు పెరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Thailand: డే కేర్ స్కూల్లో కాల్పులు
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.750 పెరిగి రూ.1,46,300కు చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు రూ.820 పెరిగి రూ.1,59,600 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర మాత్రం మార్పులేకుండా కిలోకు రూ.3,00,000 వద్ద స్థిరంగా ఉంది.
ఈ రేట్లు ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. మధ్యాహ్నానికి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ షాపుల్లో తాజా ధరలు తెలుసుకోవడం మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: