Gold price today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త లభించింది. దేశీయ మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. వెండి ధర కూడా భారీగా పతనమవుతూ పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ పెరుగుదల బాట పట్టడం గమనార్హం.
దేశీయంగా Hyderabad లో చూస్తే, 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ.650 తగ్గి తులానికి రూ.1,40,900 వద్దకు చేరింది. దీనికి ముందు రోజు కూడా రూ.4,600 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఈ రోజు రూ.710 తగ్గడంతో 10 గ్రాములకు రూ.1,53,710గా నమోదైంది. జనవరి 29న నమోదైన ఆల్టైమ్ హైతో పోలిస్తే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.23,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.25,140 మేర తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి.
Read Also: India vs England U19 : రికార్డుల సునామీ సృష్టిస్తున్న భారత్

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పతనమయ్యాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర ఈ రోజు మరో రూ.20,000 తగ్గి రూ.2.80 లక్షల వద్ద ట్రేడవుతోంది. జనవరి 29న రూ.4.25 లక్షల వద్ద ఉన్న వెండి ధర, అక్కడి నుంచి మొత్తం రూ.1.45 లక్షల మేర తగ్గడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,600 డాలర్ల స్థాయి నుంచి ఒక్కరోజులోనే 4,965 డాలర్లకు చేరింది. దాదాపు 300 డాలర్ల పెరుగుదల నమోదైంది. వెండి ధర కూడా 64 డాలర్ల నుంచి 77.88 డాలర్లకు చేరి 20 శాతానికిపైగా పెరిగింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లో ఉదయం 10 గంటల తర్వాత కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: