ఆంధ్రప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల సంజన వరద, (Sanjana flood) దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మిస్ గ్రాండ్ ఇండియా 2025 (Miss Grand India 2025) పోటీలకు ఫైనలిస్ట్గా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎంతో కఠినమైన ఎంపిక ప్రక్రియను దాటి ఆమె ఈ స్థాయికి చేరడం విశేషమే.సంజన, తిరుపతి జిల్లా చంద్రగిరిలో పుట్టారు. విద్యార్థిగా బెంగళూరులోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి చదువు పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. చదువుతో పాటు మోడలింగ్ ప్రపంచంలో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.2024లో సంజన మిస్ టీన్ గ్లోబ్ ఇండియా టైటిల్ గెలిచి సంచలనం సృష్టించారు. అదే ఏడాది మిస్ టీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచారు. ఈ విజయాలతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
చదువు, మోడలింగ్, నటన… మల్టీటాలెంటెడ్ సంజన
ఇంజినీరింగ్ చదువుతో పాటు మోడలింగ్లో రాణించడమే కాదు, నటనలోనూ తమ సత్తా చూపేందుకు సంజన ప్రయత్నిస్తున్నారు. పలు రంగాల్లో సమానంగా రాణించడం ఆమె ప్రత్యేకతగా మారింది.మిస్ గ్రాండ్ ఇండియా పోటీలు యువతకు ప్రతిభను ప్రదర్శించేందుకు గొప్ప వేదిక. అందం, తెలివితేటలు, వ్యక్తిత్వం, సామాజిక సేవా దృక్పథంతో సంజన ఇప్పటికే తనతనాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపికైన ఇతర ఫైనలిస్టులతో కలిసి టైటిల్ కోసం పోటీపడతారు.
మద్దతుగా నిలుస్తున్న ఏపీ, కర్ణాటక ప్రజలు
సంజన విజయానికి తల్లిరాజ్యం ఆంధ్రప్రదేశ్తో పాటు విద్యాభ్యాసం చేసిన కర్ణాటక ప్రజలు కూడా గట్టిగా మద్దతు ఇస్తున్నారు. మిస్ గ్రాండ్ ఇండియా 2025 ఫినాలే తేదీ ఇంకా ప్రకటించకపోయినా, ఈ ఈవెంట్ grandగా జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు.
Read Also : Hyderabad : ట్రాలీ బ్యాగ్ హత్య కేసులో నిందితుడిని గుర్తించిన పోలీసులు