Ashwini Vaishnaw : టికెట్ రిజర్వేషన్ చార్ట్ పై కీలక నిర్ణయం : రైల్వే శాఖ

Read Time:  1 min
Ashwini Vaishnaw : టికెట్ రిజర్వేషన్ చార్ట్ పై కీలక నిర్ణయం : రైల్వే శాఖ
FONT SIZE
GET APP

రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ (Indian Railways) నుండి ఓ గొప్ప శుభవార్త వచ్చింది. ఇకపై రిజర్వేషన్ తుది చార్ట్‌ను రైలు బయలుదేరే 8 గంటల ముందే విడుదల చేయనుంది. ఇప్పటి వరకు ఈ చార్ట్‌ను కేవలం 4 గంటల ముందు మాత్రమే రిలీజ్ చేసేవారు. ఈ కొత్త మార్పుతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు చాలా ఉపశమనం లభించనుంది.వెయిటింగ్‌లో ఉన్న ప్రయాణికులకు ఇది మంచి అవకాశం. వారు తమ టికెట్ స్టేటస్‌ను ముందే తెలుసుకోవచ్చు. కన్ఫర్మ్ కాకపోతే ఇతర ఏర్పాట్లకు సమయం దొరుకుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎక్కువగా లాభపడతారు. ఇదే లక్ష్యంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) అధికారులతో సమీక్ష చేసి నిర్ణయం తీసుకున్నారు.(Ashwini Vaishnaw)

రికార్డు స్థాయిలో టికెట్ బుకింగ్‌కు అవకాశం

ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను (PRS) రైల్వే విస్తృతంగా అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) రూపొందిస్తోంది. ఇది మునుపటి కన్నా పది రెట్లు ఎక్కువ లోడ్‌ను హ్యాండిల్ చేయగలదు. ఒక నిమిషంలోనే 1.5 లక్షల టికెట్లు బుక్ చేయడం, 40 లక్షల టికెట్ ఎంక్వైరీలను మేనేజ్ చేయడం సాధ్యం అవుతుంది.

డిసెంబర్ 2025లో కొత్త వ్యవస్థ అందుబాటులోకి

ఈ అధునాతన టికెటింగ్ సిస్టమ్ డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు వేగవంతమైన సేవలు లభిస్తాయి. టికెట్ బుకింగ్ కూడా సులభతరమవుతుంది. ముఖ్యంగా పీక్స్ సీజన్‌లో వెబ్‌సైట్ క్రాష్ అవుతుండడాన్ని ఇది నివారిస్తుంది.జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఓటీపీ తప్పనిసరిగా అమలు చేయనున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు ఆధార్ లేదా డిజిలాకర్ ఆధారిత గుర్తింపు అవసరం. దీనివల్ల టికెట్ దళారులదొంగ దాడులకు చెక్ పడుతుంది. ప్రయాణికుల భద్రతకు ఇది మంచి మార్గం అవుతుంది.

Read Also : Nara Lokesh : మీ ఏడుపులే మాకు దీవెనలు : నారా లోకేశ్

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.