పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్థాన్కు గుణపాఠం చెప్పింది. తమ భూభాగాన్ని ఉగ్రవాద కేంద్రంగా మలిచిన పాక్కి ఇది తీవ్రమైన హెచ్చరిక. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు భారత వాయుసేన, సైన్యం కలసి పాక్ లోపల నాలుగు, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో ఐదు ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు జరిపాయి. ఈ దాడులన్నీ ఖచ్చితమైన సమాచారం ఆధారంగా సాగాయి.
ఉగ్ర సంస్థలకు చెందిన కీలక స్థావరాలు నేలమట్టం
ఈ స్ట్రాటజిక్ దాడులతో ఉగ్ర సంస్థలకు చెందిన కీలక స్థావరాలు నేలమట్టమయ్యాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థల శిబిరాలే ముఖ్యంగా లక్ష్యంగా మారాయి. ఈ చర్యలతో ఉగ్రవాద కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ వ్యూహాత్మకంగా భారత్ను అణగదీస్తుందన్న భ్రమకు చెక్ పెట్టింది.
దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది
ఇక దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 244 జిల్లాల్లో మాక్ డ్రిల్లు నిర్వహించి, భద్రతా రంగంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. బోర్డర్ల వద్ద భారత వాయుసేన భారీ విన్యాసాలు చేసి, ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉంది. భారత్తో పెట్టుకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఆపరేషన్తో పాకిస్థాన్కు స్పష్టంగా అర్థమైంది.
Read Also :