మహారాష్ట్రలో (In Maharashtra) ఓ అద్భుత సంఘటన జరిగింది. సాధారణంగా ఫ్లైట్ మిస్సవుతే వాయిదాలు, కోపాలు, సమస్యలే గుర్తొస్తాయి. కానీ ఓ మహిళకు ఇది ఆశాజ్యోతిగా మారింది. ఆమెకు కావాల్సిన చికిత్స కళ్లముందే తప్పిపోతుందనగా.. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Deputy CM Eknath Shinde) ఆమెకు అండగా నిలిచారు.ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శీతల్ అనే మహిళకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంది. అయితే శుక్రవారం ఆమె తన ఫ్లైట్ మిస్సైంది. ఆసుపత్రిలో అప్పటికే కిడ్నీ సిద్ధంగా ఉండగా, సకాలంలో చేరకపోతే అది మరొకరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేది. దీంతో ఆమె అధికారులను ఆశ్రయించారు.
డిప్యూటీ సీఎం దయా హృదయంతో చేసిన సహాయం
విషయం తెలిసిన డిప్యూటీ సీఎం షిండే వెంటనే స్పందించారు. ఆ సమయంలో ఆయన జల్గావ్ నుంచి ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా, తన చార్టెడ్ ఫ్లైట్లో ఆ మహిళను కూడా తీసుకెళ్లేందుకు ముందుకొచ్చారు. ఇది ఆమెకు ప్రాణాధారంగా మారింది.
పైలట్ల డ్యూటీ ముగిసినా.. మినిస్టర్ సమయస్ఫూర్తి మెప్పించింది
అప్పటికే పైలట్, కోపైలట్ల డ్యూటీ టైం ముగిసింది. అయినా, మినిస్టర్ గిరీశ్ మహాజన్ చొరవతో సివిల్ ఏవియేషన్ అధికారుల అనుమతులు పొందారు. పైలట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి విమానం ప్రయాణానికి సిద్ధం చేశారు.ఈ మధ్యంతర నిర్ణయం వల్ల శీతల్ ముంబైకు సకాలంలో చేరింది. అవసరమైతే కొత్త పైలట్ను ఏర్పాటు చేయాలని కూడా అధికారులు యోచించారు. డిప్యూటీ సీఎం షిండే అవసరమైతే జల్గావ్లోనే ఆగేందుకు సిద్ధమయ్యారని కలెక్టర్ తెలిపారు.
మనుషులలో మానవత్వం ఇంకా బతికే ఉంది
ఇలాంటి సంఘటనలు మనకు గుర్తు చేస్తాయి – నేతల మధ్య మానవత్వం ఇంకా బతికే ఉందని. షిండే చేసిన పనికి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ఆమెకు టైంలో చికిత్స లభించడమే కాకుండా, ప్రజా ప్రతినిధుల బాధ్యతా గుణం కూడా ప్రతిఫలించింది.
Read Also : Recharge : ఆపరేషన్ సిందూర్ రీఛార్జ్ ఆఫర్..ఎందుకంటే