హైదరాబాద్లోని ఎల్బీనగర్ (LB Nagar in Hyderabad) ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరు యాచకులు విద్యుత్ తీగల బాధితులయ్యారు. వాళ్లపై 11 కేవీ విద్యుత్ వైర్లు (Electrical wires) కూలిపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు.ప్రతి రోజూ ఓ మహిళా యాచకురాలు, ఓ పురుషుడు అక్కడే నిద్రించేవారు. శనివారం కూడా మామూలుగా భిక్షాటన అనంతరం అక్కడే నిద్రిస్తున్నారు. అయితే అర్ధరాత్రి 1:50 సమయంలో ఒక కుక్కపై విద్యుత్ తీగలు పడగా, వెంటనే అవి కాస్త దూరంగా ఉన్న యాచకులపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే కాలిపోయారు.
విద్యుత్ వైర్లు తెగిపడటానికి కారణం ఏమిటి?
ఈ ఘటనపై స్పందించిన ఎలక్ట్రికల్ డీఈ రాజేందర్ నాయక్ వివరాలిచ్చారు. గుర్తు తెలియని వాహనం ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారణంగా ఇన్సులేటర్ విరిగి విద్యుత్ తీగలు తెగిపోయాయని చెప్పారు. కానీ వాహనం ఎక్కడ ఢీకొట్టిందనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.వాహనం ఢీ చేసిన కనిపించకపోవడంతో ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. విద్యుత్ అధికారులు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు కథలు చెప్పుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
ఈ సంఘటన విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదివారం ఉదయం అక్కడికి వచ్చారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించి, బాధితుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు ఎలాఅలా తెగిపోతాయని ప్రశ్నించారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యమేనా? లేక వేరే కారణమా అనే దానిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Read Also : Telangana Cabinet : నేడే క్యాబినెట్ భేటీ.. బిగ్ అప్డేట్ వచ్చేనా?