ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై చైర్మన్ వేటు

ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై చైర్మన్ వేటు

కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఫైబర్ నెట్ కు పైసా ఆదాయం రాలేదని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థలో ఉన్నతాధికారులు సహకరించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్ గంధంచెట్టు సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజలకు ఉద్వాసన పలికినట్లు తెలిపారు.
తొలగించిన ఉద్యోగులకూ జీతాలు
గత ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి తొలగించిన ఉద్యోగులకూ జీతాలు చెల్లించారని జీవీ రెడ్డి మండిపడ్డారు. ఫైబర్ నెట్ లో సంస్కరణలు ప్రతిపాదిస్తూ 400 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశించినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఆదేశాలపై ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదన్నారు. ఇటీవల జీఎస్టీ అధికారులు ఫైబర్ నెట్ కు రూ.377 కోట్లు జరిమానా విధించిన విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదని చెప్పారు.

ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై చైర్మన్ వేటు


చెల్లించిన జీతాల సొమ్మును వసూలు చేయాలి
ఈ తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని, సంస్థకు రూపాయి ఆదాయం రాలేదని తెలిపారు. ఎండీ దినేశ్ కుమార్ ఒక్క ఆపరేటర్ ను కూడా కలవడం లేదని, కనీసం సిబ్బందికి టార్గెట్లు కూడా పెట్టడంలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేయడానికి గత ప్రభుత్వ పెద్దలతో కలిసి దినేశ్ కుమార్ కుట్ర పన్నినట్లు జీవీ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. తొలగించిన ఉద్యోగులకు చెల్లించిన జీతాల సొమ్మును దినేశ్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారుల నుంచి వసూలు చేయాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts
‘తల్లికి వందనం’లో నిబంధనలు ఇవే
'తల్లికి వందనం'లో నిబంధనలు ఇవే

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు పై కసరత్తు ప్రారంభించింది. లబ్దిదారులు.. ఆర్దిక భారం పైన లెక్కలు సిద్దం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బడికి Read more

కొత్త వ్యూహాలతో ముందుకువెళ్తున్న జగన్ కేసీఆర్
కొత్త వ్యూహాలతో ముందుకువెళ్తున్న జగన్ కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఇద్దరూ ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజకీయ Read more

Prakash raj :ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ లు ఇచ్చిన బండ్ల గ‌ణేశ్,విష్ణువర్ధన్
Prakash raj :ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ లు ఇచ్చిన బండ్ల గ‌ణేశ్,విష్ణువర్ధన్

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇది న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కు కౌంట‌ర్‌గానే ట్వీట్ చేసిన‌ట్లు నెటిజ‌న్లు Read more

Nara Lokesh : వైసీపీ దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త కన్నీటి నివాళులు: నారా లోకేశ్
Nara Lokesh వైసీపీ దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త కన్నీటి నివాళులు నారా లోకేశ్

Nara Lokesh : వైసీపీ దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త కన్నీటి నివాళులు: నారా లోకేశ్ చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ మృతి చెందడం రాజకీయంగా Read more