IPS Cadre : రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంచిన కేంద్రం

Read Time:  1 min
telangana IPS Cadre
telangana IPS Cadre
FONT SIZE
GET APP

తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల (IPS Cadre) సంఖ్య పెంచుతూ కేంద్ర ప్రభుత్వం (Central Govt
) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి మంజూరైన 139 ఐపీఎస్ క్యాడర్ పోస్టులను 151కి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిరక్షణ, భద్రతా వ్యవస్థ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. ఇది పోలీస్ వ్యవస్థలో అవసరమైన మానవ వనరుల పెరుగుదలకే సూచికగా భావిస్తున్నారు.

ఐపీఎస్ పోస్టులపై సమీక్ష

గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు అవసరమైన ఐపీఎస్ పోస్టులపై సమీక్ష జరిపి, కనీసం 29 పోస్టులు పెంచాలని అభ్యర్థించారు. కేంద్రం దీనిపై సమీక్ష అనంతరం 12 పోస్టులు మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, ఐదేళ్లకు ఒక్కసారిగా క్యాడర్‌ను సమీక్షించడం కేంద్ర ప్రభుత్వం విధానంగా పాటిస్తోంది. ఈ నేపథ్యంలో గతసారి 2016లో క్యాడర్ పెంపు జరిగింది.

శాంతి భద్రతల పరిరక్షణ

ఐపీఎస్ అధికారుల సంఖ్య పెరగడం వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కమిషనరేట్‌లు, ప్రత్యేక విభాగాలు, జిల్లా విభజనల తర్వాత ఏర్పడిన కొత్త పరిపాలనా అవసరాలను తీర్చడానికి అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ వంటి విభాగాల్లో మరింత నిపుణులను నియమించుకునే అవకాశాలు కలుగనున్నాయి. ఈ పెంపుతో పోలీస్ శాఖ కార్యాచరణ మరింత వేగవంతమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Visakhapatnam : విశాఖలో మళ్లీ కరోనా .. యువతికి పాజిటివ్‌

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.