హైదరాబాద్ : ఉద్యానవన శాఖను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 175 మంది ఉద్యానవన విస్తరణాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా 2026 మార్చి 31 వరకు రాష్ట్ర హార్టి కల్చర్ శాఖ డైరెక్టర్ (Director of Horticulture Department) నియంత్రణలో పనిచేయడానికి ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన నియామకం చేపట్టారు. అత్యదికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 13 మంది, ఖమ్మంలో 12, నల్లగొండ జిల్లాలో 11 మంది, రంగారెడ్డి జిల్లాలో 10, వికా రాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో 07 గురిని నియమించారు. వీరికి నెలకు రూ. 22,750 వేతన ఇవ్వనున్నట్లు ప్రభుత్వం సాధారణ పోస్టులు భర్తీ చేసేవరకు వారే విధుల్లో ఉంటారని వెల్లడించింది.

విస్తరణ అధికారి
కాగా ఉద్యాన శాఖలో, సాగులో శాస్త్ర సాంకేతిక మెలకువలు, సలహాలు సూచనలను ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో వ్యవసాయ విస్తరణ (Agricultural expansion) అధికారిలాగా ఉద్యాన విస్తరణ అధికారి లేకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 175 మంది ఉద్యాన విస్తరణ అధికారులల్లో చాలా తక్కువ మంది క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కాకుండా ఉద్యాన విశ్వవిద్యాలయం డిప్లమా, ఉద్యాన డిగ్రీ చదివిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అటు ఉద్యాన రైతులకు (horticultural farmers), ఉద్యాన పట్టభద్రు లకు లాభం చేకూర్చి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అ శాఖ ఉద్యోగవర్గాలు సూచిస్తున్నాయి.
ఉద్యానవన శాఖ అంటే ఏమిటి?
ఉద్యానవన శాఖ (Horticulture Department) అనేది పంటలు కాకుండా ఇతర వాణిజ్యపరమైన మొక్కల పెంపకానికి సంబంధించి పనిచేసే శాఖ.
ఉద్యానవన శాఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
రైతులకు అధిక ఆదాయం వచ్చే విధంగా ఉద్యానపంటల సాగును ప్రోత్సహించడం, సాంకేతిక సహాయం అందించడం, మొక్కలు, ఎరువులు, పురుగుమందులు లాంటివి సరఫరా చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యాలు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Srinivas Goud: సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి