Terror Attack : ఉగ్రదాడి.. భారత్‌లో పాకిస్థాన్‌ ‘ఎక్స్‌’ ఖాతా నిలిపివేత

Read Time:  1 min
Terrorist attack.. Pakistan's 'X' account suspended in India
Terrorist attack.. Pakistan's 'X' account suspended in India
FONT SIZE
GET APP

Terror Attack : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడి నేపథ్యంలో న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కీలక దౌత్య చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు.

ఉగ్రదాడి భారత్‌లో పాకిస్థాన్‌ 'ఎక్స్‌'

భారత భూభాగంలో పాకిస్థాన్ ప్రభుత్వ ఖాతా నిలిపివేత

ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, ఈ ఖాతా వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని భావించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ, సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ను సంప్రదించి, భారత భూభాగంలో పాకిస్థాన్ ప్రభుత్వ ఖాతాను నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది

రోజుల్లోగా దేశాన్ని విడిచిపెట్టాలని స్పష్టం

ఈ నిర్ణయాల సందర్భంగా సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాక, ఇరు దేశాల మధ్య ఉన్న అటారీ సరిహద్దు గేటును కూడా తాత్కాలికంగా మూసివేశారు. భారత్‌లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులు ఇకపై అవాంఛిత వ్యక్తులుగా గుర్తించి, వారందరికీ వారం రోజుల్లోగా దేశాన్ని విడిచిపెట్టాలని స్పష్టం చేసింది కేంద్రం.

Read Also: మా అన్నను చంపిన ఉగ్రవాది తల తెచ్చి ఇవ్వండి : లెఫ్టినెంట్ నర్వాల్ చెల్లి

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.