Tension in Serbian parliament.. MPs injured

సెర్బియా పార్లమెంట్‌లో ఉద్రిక్తత .. ఎంపిలకు గాయాలు

బెల్గ్రేడ్: సభలో పొగ బాంబులు విసరడంతో మంగళవారం సెర్బియా పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ముగ్గురు పార్లమెంట్‌ సభ్యులు గాయపడగా, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విశ్వ విద్యాలయ విద్యకు నిధుల పెంపునకు ఉద్దేశించిన చట్టంపై ఓటింగ్‌ జరగాల్సి వుంది. ఈ సమావేశమే చట్ట విరుద్ధమైనదని వాదిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ముందుగా ప్రధాని మిలోస్‌ వుసెవిక్‌ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. సమావేశం ప్రారంభమైన గంట తర్వాత పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. సెర్బియా ఎదుగుతోంది. పాలన క్షీణిస్తోంది అని రాసి వున్న బ్యానర్‌ను చేబూని, ఈలలు ఊదుతూ ప్రతిపక్ష సభ్యులు సభలో నినాదాలు చేశారు.

సెర్బియా పార్లమెంట్‌లో ఉద్రిక్తత ఎంపిలకు

పొగబాంబులు విసరడంతో ముగ్గురు ఎంపిలకు గాయాలు

దీంతో ఎంపీల మధ్య తొలుత ఘర్షణ మొదలైంది. ఆ వెంటనే పొగ బాంబులు విసురుకున్నారని బయటకు వచ్చిన వీడియోలను బట్టి తెలుస్తోంది. గుడ్లు, నీళ్ళ సీసాలను కూడా ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రతిపక్షం తీవ్రవాదుల్లా వ్యవహరిస్తోందని పార్లమెంట్‌ స్పీకర్‌ అనా బ్రనబిక్‌ విమర్శించారు. ఈ సంఘటనతో దేశంలో రాజకీయ సంక్షోభం ఎంతలా నెలకొందో స్పష్టమవుతోంది. నెలల తరబడి కొనసాగుతున్న అవినీతి వ్యతిరేక నిరసనలతో ప్రభుత్వం అట్టుడికిపోతోంది. ఆందోళనలు ఉధృతం కావడంతో ప్రధాని వుసెవిక్‌ తన పదవికి జనవరిలో రాజీనామా చేశారు. పార్లమెంట్‌ ఇంకా దాన్ని ఆమోదించాల్సి వుంది.

విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం

కాగా, సెర్బియాలోని నోవీసాడ్ నగరంలో గత నవంబర్‌లో ఓ రైల్వే స్టేషన్ ముఖద్వారం పైకప్పు కూలి 15 మంది మృతి చెందారు. అప్పటి నుంచి విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థుల ఉద్యమానికి మేధావులు, న్యాయమూర్తులు, రైతులు, న్యాయవాదులు, నటులు సహా అనేక రంగాలకు చెందిన వారు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఉద్యమ తీవ్రతకు తలొగ్గిన ప్రధాన మంత్రి మిలోస్ పుచెవిచ్ ఇటీవల రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి రాజీనామాను 30 రోజుల్లో ఆమోదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదా మధ్యంతర ఎన్నికలు జరిపించడమా అనేది తేల్చాల్సి ఉంది. అయితే పార్లమెంటులో ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోపక్క పార్లమెంటులో యూనివర్సిటీ విద్యకు నిధులు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై చర్చ జరిగింది. దీనిపై ఓటింగ్ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

Related Posts
ఇంజెక్షన్ తో రొమ్ము క్యాన్సర్ చికిత్స
ఇంజెక్షన్ తో రొమ్ము క్యాన్సర్ చికిత్స

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి మరియు బోస్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతాకు చెందిన శాస్త్రవేత్తల బృందం రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స కోసం అధునాతన ఇంజెక్షన్ హైడ్రోజెల్‌ను Read more

సంక్రాంతికి ఊరెళ్తున్నా వారు జాగ్రత్త..పోలీసుల హెచ్చరికలు
pongal

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలకు వెళ్లే వారు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు హెచ్చరించారు. పండుగ సందర్భంగా ఎక్కువ మంది గ్రామాలకు వెళ్లడం, Read more

తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా
తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వేడుకలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.16 ఏళ్ల మోనాలిసా పూసలమ్మకుంటే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది.ఆమె అందంతో మైండ్ Read more

భారత్-పాకిస్తాన్ ఫ్లాగ్ మీటింగ్ – శాంతి ఒప్పందానికి కొత్త దారి?
భారత్-పాకిస్తాన్ ఫ్లాగ్ మీటింగ్ – శాంతి ఒప్పందానికి కొత్త దారి?

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి శుక్రవారం భారత్, పాకిస్తాన్ మధ్య బ్రిగేడ్ కమాండర్ స్థాయి ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. ఇటీవల జరిగిన Read more