Yoga: జూన్ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం అధ్వర్యంలో హైదరాబాదులోని ప్రముఖ కేబీఆర్ పార్కు (KBR Park) లో ఘనంగా యోగా డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ముఖ్య అతిథిగా హాజరై, యోగాసనాలు వేయడంలో ప్రజలతో కలసి పాల్గొన్నారు. ఉదయం పొద్దుపొడవుతోనే ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, యువతతో పాటు వయోవృద్ధులు, మహిళలు, బాలబాలికలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

యోగాను జీవనశైలిగా మార్చుకుందాం – మంత్రి పిలుపు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ – తాను ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఉండడానికి కారణం ప్రతి రోజు యోగా చేయడమే అని అందుకే ప్రతి ఒక్కరు యోగా చేయాలని పొన్నం సూచించారు. ప్రతి రోజూ యోగ చేయడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తన తోటి మిత్రులు యోగ చేయకపోవడం వలన ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అందుకే ప్రతి ఒక్కరు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని మంత్రి పొన్నం అన్నారు.
యోగాడే సందర్బంగా ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకొవాలని ప్రతి ఒక్కరూ వారి జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.ప్రస్తుతం ఎంతో మంది పని ఒత్తిడితో సతమతమవుతున్నారని ప్రతి రోజు యోగా చేయడంతో ఇలాంటి ఆన్ని సమస్యలకు చెక్పెట్టవచ్చని అన్నారు. దీనికి ప్రత్యేకంగా జాతి, మతం లేదని.. యోగాను ఒక్క రోజు కార్యక్రమంలా కాకుండా జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
యోగా డే వేడుకల్లో ప్రముఖులు హాజరు
ఈ కార్యక్రమంలో హాజరైన ప్రముఖుల్లో మంత్రి పొన్నంతో పాటు హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరి చందన, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. హైదరాబాద్లో ఆరోగ్యంగా ఆనందమయ జీవితం గడపడానికి యోగా ఎంతో దోహదం చేస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన అన్నారు.
కలెక్టర్ హరి చందన మాట్లాడుతూ, హైదరాబాద్ నగర వాసులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించేందుకు యోగా గొప్ప మార్గం. రోజూ కొన్ని నిమిషాలు యోగాకు కేటాయించడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు,” అని ప్రజలను ప్రోత్సహించారు.
యోగా: జాతీయత కన్నా విశ్వమానవతకు చిహ్నం
ఈ యోగా డే సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ముఖ్యమైన సందేశం అందించారు. యోగాకు జాతి లేదు, మతం లేదు. ఇది ఒక విశ్వమానవ విజ్ఞానం. మన పురాతన సంస్కృతి నుండి వెలువడిన యోగాను ప్రపంచం గౌరవిస్తోంది. ఇది ఒక్క భారతదేశానికే కాదు, సమస్త మానవజాతికి వరంగా మారింది, అని అన్నారు.
Read also: KTR: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ను ఖండించిన కేటీఆర్